బంగారంపై ఆమ్నెస్టీ లేదు... అదంతా ఉత్తుత్తి ప్రచారమే...

గురువారం, 31 అక్టోబరు 2019 (17:58 IST)
బంగారంపై పన్ను విధించనున్నారనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేసింది. బడ్జెట్ తయారీకి ముందు ఇలాంటి వార్తలు రావడం సహజమేనని స్పష్టం చేసింది. 
 
బంగారంపై ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందంటూ గత కొన్ని రోజులుగా విస్తృతమైన ప్రచారం సాగుతోంది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. 
 
నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. పరిమితికి మించి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయబొతున్నారని.. దీని ప్రకారం.. పరిమితికిమించి బంగారం ఉన్నవాళ్లంతా దానిని బయటపెట్టి, అందుకు తగినంత పన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ప్రచారం ఇపుడు దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం స్పందించింది. అసలు బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనంటూ సంబంధిత అధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతానికి ఈ బంగారంపై నెలకొన్న టెన్షన్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగినట్లే. 

అన్నీ చూడండి

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

తర్వాతి కథనం
Show comments