Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి హుండీలో డబ్బు చోరీ చేస్తుండగా దిమ్మతిరిగే ట్విస్ట్!

Written By ఎం
Updated: మంగళవారం, 23 మార్చి 2021 (22:58 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీకే కన్నం వేయాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని హుండీలో ఓ యువకుడు చోరీకి ప్రయత్నించాడు. నిందితుడు హుండీలోని రూ. 30 వేలు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.
 
ఇంతలో విజిలెన్స్ అధికారులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం సీసీటీవీ కెమెరాల ద్వారా అతడి చోరీ బండారాన్ని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు నిందితుడిని రెడ్‌ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.
 
సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా, శ్రీవారి ఆలయ హుండీలోనే చోరీకి ప్రయత్నించడం తిరుమలలో తీవ్ర చర్చనీయాంశమైంది.

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments