Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పేల్చిన భారత్... ఉలిక్కిపడిన చైనా-పాక్

Updated: బుధవారం, 27 మార్చి 2019 (19:03 IST)
కేవలం 3 నిమిషాల్లోనే 300 కిలోమీటర్ల ఎత్తులో వున్న ఉపగ్రహాన్ని తునాతునకలు చేసింది మిషన్ శక్తి. దీనిపై ప్రధానమంత్రి మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని దిగ్విజయంగా ఢీకొట్టడం ద్వారా భారతదేశం అగ్రదేశాల సరసన చేరిందన్నారు. తమ ప్రయోగం ఏ దేశాన్ని ఉద్దేశించింది కాదన్నారు. మిషన్ శక్తి సక్సెస్‌తో భారత్ అంతరిక్షంలో మహాశక్తిగా ఎదిగిందన్నారు.
 
భారతదేశం ప్రయోగించిన యాంటీ శాటిలైట్ విషయం తెలియగానే పాకిస్తాన్-చైనాలు ఉలిక్కిపడ్డాయి‌. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ... అంతరిక్షం అందరిది.. అక్కడ కూడా ఇలాంటి విన్యాసాలు తగవని భారతదేశం పేరును ప్రస్తావించకుండా సన్నాయినొక్కులు నొక్కారు. చైనా స్పందిస్తూ... ఎలాంటి పరీక్షలు చేసినా ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతియుతంగా వుండాలన్నదే తమ అభిమతం అని పేర్కొంది.
 
కాగా మిషన్ శక్తిని ప్రయోగించి విజయవంతం చేయడం ద్వారా భారతదేశం అగ్ర రాజ్యాలైన అమెరికా, ర‌ష్యా, చైనా దేశాల‌ సరసన చేరింది.

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments