నేను చెప్పింది చేసిన తరువాత హోదా రాకుంటే నన్ను చంపేయండి... పోసాని

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఎపిలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యేక హోదా కోసం రెండు సలహాలను ఇచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుని తీరుతామన్న

సోమవారం, 12 మార్చి 2018 (19:18 IST)
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఎపిలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యేక హోదా కోసం రెండు సలహాలను ఇచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుని తీరుతామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారాయన. పోసాని చెప్పిన రెండు సలహాలు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. ఎక్కడా మాట్లాడలేదు.
 
అందులో మొదటిది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతలందరూ కూడా కలిసికట్టుగా అమరావతి ముందు నెలరోజుల పాటు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోవాలి. వారితో పాటు నేను కూడా కూర్చుంటాను. ఇలా చేస్తే మోడీ స్వయంగా అమరావతికి వచ్చి హోదా ఇచ్చి వెళతారు. 
 
ఇక రెండవది 3 కోట్లమంది ప్రజలు పాదయాత్రగా ఢిల్లీకి వెళదాం. ప్రజా సంఘాలన్నీ ఐక్యమై ముందుకు వెళుతుంటే ప్రజలు కలిసి రావాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. ఒకవేళ అప్పటికీ ఇవ్వకుండా... నా సలహా ఫెయిలైతే నన్ను చంపేయండి అన్నారు పోసాని క్రిష్ణమురళి. పోసాని క్రిష్ణమురళి చేసిన వ్యాఖ్యలకు వేలాదిమంది యువత మద్ధతు తెలుపుతూ సందేశాలు పంపారు. దటీజ్ పోసాని.

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments