Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచులో పిడిగుద్దులు- రాసలీలల టేపు... వద్దు బత్తాయీ అన్నా విన్లేదు, పోసాని చెప్పింది కరెక్టా?

Written By ఐవీఆర్
Updated: సోమవారం, 13 జనవరి 2020 (18:33 IST)
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ డైలాగుకి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన పృథ్విరాజ్ చేపట్టిన ఎస్వీబీసి పదవి మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఆయన ఓ మహిళా ఉద్యోగినితో చేసిన సంభాషణ అంటూ పలు ఛానళ్లలో ప్రసారమైన ఆడియో రచ్చ చేసింది. చివరికి ఈ కారణంగా ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది. 
 
ఆ ఛానల్ కి చైర్మన్ పదవిని చేపట్టేటపుడు ప్రక్షాళన చేస్తానంటూ చెప్పారు పృథ్వి. కానీ అది ఎంతమేరకు చేశారో తెలియదు కానీ పదవి మాత్రం పోయింది. నిజానికి పృథ్వి ఎస్వీబీసి ఛానల్ చైర్మన్ పదవి చేపట్టగానే, ఆ పదవిని పృథ్వి చేపట్టకుండా వుండి వుంటే బాగుండేది అని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి  చెప్పారు. 
 
ఇప్పుడు ఆయన మాటలే కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే అనవసరంగా పోస్టుని చేపట్టి మంచులో ముసుగు మనుషుల పిడిగుద్దులు, దెబ్బలు తినడంతో పాటు రాసలీలల ఆడియో టేపు పృథ్వి పరువును బజారున పడేశాయి. ప్చ్... పృథ్వి.

అన్నీ చూడండి

Agadha Movie Review: ఎం.ఎస్.రాజు తీసిన అగథ మెప్పించిందా ? లేదా?

రజనీకాంత్, కమల్ హాసన్ ధర్మన్ రెండవ షెడ్యూల్ ప్రారంభం

హుషార్ పిట్టలు కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది :వెంకట్‌ యాదవ్‌

Nag: కన్స్యూ మర్ యాప్ ను ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అక్కి నేని నాగార్జున

Kamakshi Bhaskarla: వద్దు అని నా ముందే అన్నారు,అదే చేదు అనుభవం : కామాక్షి భాస్కర్ల

తర్వాతి కథనం
Show comments