Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్న ర‌జ‌నీకాంత్‌, అమెరికా వెళ్తారట..

Written By డివి
Updated: సోమవారం, 4 జనవరి 2021 (12:54 IST)
సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అటు సినిమాలు, ఇటు రాజ‌కీయ ప్ర‌వేశం రెండు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త‌న ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో రాజ‌కీయ పార్టీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు తేల్చిచెప్పారు.  ఇందుకు త‌మిళ‌నాడులో ఆయ‌న అభిమానులు చాలా నిరాశ‌తో వున్నారు. అయినా ముందు ఆరోగ్యం చూసుకోవాల‌ని అమెరికాకు వెళ్లే ప్ర‌య‌త్నంలో వున్నారు. అయితే ముందుగా ర‌జ‌నీ దంప‌తులు నమో నారాయణస్వామి ఆశీస్సులు అందుకున్నారు.
 
ర‌జ‌నీ ప‌రిస్థ‌తి చూసిన స్వామిజీ స్వ‌యంగా ర‌జ‌నీకాంత్ ఇంటికి వ‌చ్చి ఆయ‌న‌తో అర‌గంట సేపు ముచ్చ‌టించారు. ప‌లు విష‌యాల‌పై వీరిద్ద‌రు ముచ్చ‌టించుకున్నారట. వెళ్లేముందు ర‌జ‌నీకాంత్ దంప‌తుల‌కు ఆశీస్సులు అందించారు. అనారోగ్యానికి గురైన త‌ర్వాత రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్‌ మండ్రం వర్గాలు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో స్వామిజీ ఎంట్రీ ఆస‌క్తిక‌రంగా మారింది.
 
అన్నాత్తె చిత్ర షూటింగ్ కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. మ‌రి ర‌జ‌నీ షూటింగ్ పూర్తి చేస్తాడా లేదా.. అనేది ప‌క్క‌న పెడితే.. ఆరోగ్యం కోసం స్వామిజీ ఆశీస్స‌లు తీసుకున్నాడ‌ని సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments