ఆన్‌లైన్ క్లాసులే అయితే పాఠశాలలు ఫీజులు త‌గ్గించాల్సిందే: సుప్రీంకోర్టు

బుధవారం, 5 మే 2021 (23:13 IST)
సాధార‌ణ స్కూలు త‌ర‌గ‌తుల‌తో పోలిస్తే ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ త‌ల్లిదండ్రుల‌కు భారంగా మారిందని సుప్రీం కోర్టు పేర్కొంది. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది నుంచి స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న తరుణంలో స్కూళ్ల‌కు ఇంకా ఖ‌ర్చు త‌గ్గిందని సుప్రీం పేర్కొంది.
 
కొవిడ్ కార‌ణంగా విద్యార్థుల త‌ల్లిదండ్రులు‌ ప‌డిన ఇబ్బందుల‌ను స్కూలు యాజ‌మాన్యాలు అర్థం చేసుకోవాల‌ని, ఆమేరకు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని ఆదేశించింది.
 
విద్యార్థుల‌కు అందించ‌ని వ‌స‌తుల‌కు కూడా ఫీజులు వ‌సూలు చేయ‌డం లాభార్జ‌నే అవుతుంద‌ని, అది మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. ఇక గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా చాలా కాలం స్కూళ్లు తెర‌వలేదు. 
 
దీని కార‌ణంగా పెట్రోల్‌/డీజిల్‌, క‌రెంటు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు, నీటి ఛార్జీలు, స్టేష‌న‌రీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments