Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్95 మాస్క్

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 5 జులై 2022 (10:35 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ నుంచి రక్షించేందుకు సరైన టీకా ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. అయితే, ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు, ఒకవేళ వైరస్ సోకినా ప్రాణహాని లేకుండా ఉండేందుకు మాత్రం కరోనా టీకాలను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో కొవిడ్‌-19కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్‌95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
 
ఈ మాస్క్ వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాకుండా వైరస్‌ను చంపేస్తుంది. పైగా, ఈ మాస్కును ఎక్కువ కాలం వాడొచ్చు. ఎన్‌95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్‌ ఫిల్టర్లలోకి బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీ మైక్రోబియల్‌ పాలీమర్లను విజయవంతంగా జోడించడం ద్వారా రెన్‌సెలీర్‌ పాలీటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. 
 
'ఎన్‌95లోని క్రియాశీల ఫిల్టరేషన్‌ పొరలు చాలా సున్నితమైనవి. అవి రసాయన మార్పుల ప్రభావానికి సులువుగా లోనవుతాయి. ఫలితంగా వాటి వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఈ మాస్కుల్లోని పోగుల కూర్పును మార్చాలి. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది అవుతుంది' అని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో తాము యాంటీబ్యాక్టీరియల్‌ సామర్థ్యం కలిగిన అమోనియం పాలీమర్లను ఈ పాలీప్రొపలీన్‌ పోగుల ఉపరితలానికి జోడించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అతినీలలోహిత కిరణాల సాయంతో గ్రాఫ్టింగ్‌ చేసినట్లు వివరించారు. ఈ మాస్కు.. తనమీద పడిన వైరస్‌ను చంపేస్తుందని పేర్కొన్నారు. 

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments