Bullet Bandi: ఒక్క డ్యాన్స్‌తో ఓవర్ నైట్ సెలబ్రిటీ, ఎవరు..?

ఆదివారం, 22 ఆగస్టు 2021 (00:01 IST)
ఒకే ఒక్క పాట ఆమెను సెలబ్రిటీని చేసేసింది. అసలు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. పెళ్ళి కొడుకు ఉండగానే అతని ముందుగానే ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో పెళ్ళి కొడుకు కాసేపు డ్యాన్స్ వేశాడు కానీ ఆ తరువాత ఎక్కువసేపు డ్యాన్స్ వేయలేకపోయాడు. ఆ యువతి ఎవరన్నది ఇప్పుడు అందరిలోను ఆసక్తికరంగా మారింది.
 
ఆమె పేరు సాయిశ్రియ. మంచిర్యాలకు చెందిన యువతి. అటవీశాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె. రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరిగిన తరువాత ఇంటికి వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ డ్యాన్స్ వేశారు. 
 
సాయిశ్రియ మాత్రం ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసలు ఆ యువతి అన్న విషయాన్ని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాధారణ యువతి ఆ స్థాయిలో డ్యాన్స్ వేయడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ డ్యాన్స్‌తో బుల్లెట్ బండికి పాటకు మంచి పేరే వచ్చింది. 

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments