బొప్పాయి గుజ్జు ముఖానికి పట్టిస్తే..?

శనివారం, 1 డిశెంబరు 2018 (15:51 IST)
చలికాలంలో చాలామందికి ముఖం పొడిబారి చర్మమంతా అలసట, నీరసంగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం లభించాలని రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌‌లు వాడుతుంటారు. దాంతో సమస్య మరింత ఎక్కువగా మారుతుంది. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చును.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
తప్పకుండా అందరూ ప్రతిరోజూ స్నానం చేస్తూనే ఉంటారు. అయినా చర్మమంతా తెల్లతెల్లగా మారి దురదలు పెడుతూ వుంటుంది కొందరికి. అలాంటప్పుడు స్నానానికి వాడే సబ్బుకు బదులుగా సున్నిపిండిని ఉపయోగించాలి. 
 
ఒక పెద్ద అరటిపండును తొక్కతీసి.. పండును గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులో 2 స్పూన్ల గులాబీ నీరు కొద్దిగా తేనె, పాలపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కుని పొడి టవల్‌తో తుడుచుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 
 
బొప్పాయి పండు ఈ సీజన్‌లో విరివిగా దొరుకుతుంది. కాబట్టి ఓ బొప్పాయి పండు రెండు సగాలుగా కట్ చేసి వాటిలోని గింజలు తీసేయాలి. ఆ తరువాత దాని తొక్కను తీసి పండును గుజ్జులా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఆపిల్ రసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. రెండుగంటల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చాలు. చర్మం సున్నితంగా తయారవుతుంది.   

అన్నీ చూడండి

సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా

గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్‌ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments