పురాతన మండపం కుప్పకూలింది, ఎక్కడ?

శనివారం, 20 నవంబరు 2021 (22:13 IST)
తిరుపతి అంటేనే పుణ్యక్షేత్రం. ఆలయాలకు నిలయం. అలాంటి ప్రాంతంలో వరద బీభత్సం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. అయితే ఎన్నో యేళ్ళ చరిత్ర కలిగిన పురాతన మండపం కూడా కుప్పకూలింది.

 
తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నడపబడే కపిలేశ్వర ఆలయంలో వరద ఉధృతి నిన్న ఎక్కువైంది. నిన్న సాయంత్రానికి నాలుగు స్తంభాలు బీటలు వారాయి. దీంతో వేణుగోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం ఒక్కసారిగా కుప్పకూలింది.

 
అయితే మండపం కుప్పకూలే సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించడం.. భక్తుల రాకపోకలు తగ్గువగా ఉండడంతో కపిలతీర్థంలో భక్తుల దర్శనాన్ని కూడా టిటిడి నిలిపివేసింది. 

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments