ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 22 ఆగస్టు 2022 (20:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి యేటా నిర్వహించే పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుతం 11 పేపర్లతో నిర్వహించే ఈ పరీక్షను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. అంటే టెన్త్ పబ్లిక్ పరీక్షా పేపర్ల సంఖ్యను ఆరుకి కుదించింది. ఈ కొత్త పరీక్షా విధానం వచ్చే యేడాది నుంచి అమల్లోకిరానుంది. 
 
జాతీయ స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్నాయి. ఆ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర సిలబస్ ఆధారంగా జరిగే పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కారు గతంలో నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం కొత్త పరీక్షా విధానానికి ఆమోదముద్రవేసింది. 

అన్నీ చూడండి

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

Ajay Bhupathi : ఆ కథను నా డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంచుకోమని మహేష్ బాబు అన్నారు

Kajal Aggarwal: విడుదలకు ముందే చర్చకు తావిస్తున్న ది ఇండియా స్టోరీ

ఆ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఆరోగ్యంగానే ఉన్నాను : అమితాబ్

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

తర్వాతి కథనం
Show comments