Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమవరంలో భారీ కుంభకోణం.. రూ.370 కోట్ల రుణం తీసుకుని?

Written By శ్రీ
Updated: సోమవారం, 19 ఆగస్టు 2019 (19:36 IST)
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు బ్యాంకులకు కొందరు వ్యక్తులు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. దాదాపు రూ.370 కోట్లు రుణం పొంది.. వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ వ్యవహారంలో భీమవరానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బ్యాంకు అధికారుల సమాచారంతో  ఆయా బ్యాంకుల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. భీమవరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి రికార్డులను కూడా గత రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఆక్వారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురికి బ్యాంకులు రుణాలిస్తుంటాయి. ఇదే అదునుగా కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలను సమర్పించి రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments