కమలాపురంలో కూలిన పాపాగ్ని నది వంతెన ... రాకపోకలు బంద్

ఆదివారం, 21 నవంబరు 2021 (10:17 IST)
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. ఈ నష్టం కడప జిల్లాలో అధికంగా ఉంది. తాజాగా ఈ జిల్లాలోని కమలాపురం పాపాగ్ని నదిపై ఉన్న వంతెన గత అర్థరాత్రి కూలిపోయింది. వెలిగల్లు జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తివేయడంతో ఈ నదికి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. 
 
అప్పటికే వంతెన బాగా నాని వుండటంతో పాటు గత రెండు రోజులుగా ఈ నది ప్రమాదకరంగా ప్రవహిస్తూ వచ్చింది. కొత్తగా వెలిగల్లు వరద నీరు ఒక్కసారిగా ఉధృతంగా రావడంతో వెంతన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ బ్రిడ్జిపై నుంచే అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి వుంది. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనరాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయు. ఈ వంతెన నిర్మాణ పూర్తయ్యేంత వరకు రాకపోకలు బంద్ అయినట్టే. అయితే, ఈ వంతెన కూలిపోవడంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఈ పరిస్థితి నెల రోజుల పాటు కొనసాగనుంది. 

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments