పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (16:51 IST)
సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులను దుర్భాషలాడుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనుంది. తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబసభ్యులపై అవమానకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ కుమార్తెల చిత్రాలను షేర్ చేస్తూ నిందితులు కించపరిచే విధంగా పోస్ట్ చేశారంటూ జనసేన ప్రాంతీయ సమన్వయకర్త మల్లెపు జయలక్ష్మి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 
 
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66, 66సీ, 67తో పాటు బీఎన్‌ఎస్‌ 79, క్లాజ్‌ 353 (2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని, ప్రస్తుతం నిందితుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుమార్తెలు ఆరాధ్య, పోలేనా అంజనా పవనోవాతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. దీంతో పవన్ తొలిసారిగా ఇద్దరు కూతుళ్లతో కలిసి కనిపించారు.

అన్నీ చూడండి

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

Devi Sri Prasad: సింగ్ గీతం’ కోసమైనా ఈ మ్యూజికల్ ఫిల్మ్.ఆడాలి : దేవీశ్రీ ప్రసాద్

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

తర్వాతి కథనం
Show comments