Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా ఉధృతి.. 88కి చేరిన మృతుల సంఖ్య.. 264మందికి పాజిటివ్

Written By సెల్వి
Updated: బుధవారం, 17 జూన్ 2020 (11:07 IST)
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 264 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,720కి చేరింది. మంగళవారం చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 88మందికి పాజిటివ్‌ అని తేలింది. కృష్ణాజిల్లాలో మరో 42మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1022కి చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా మరో 41కేసులు నమోదయ్యాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని ముగ్గురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అనంతపురం జిల్లాలో 28మందికి పాజిటివ్‌ వచ్చింది. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 56చొప్పున, తూర్పుగోదావరిలో 16, నెల్లూరులో 5కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో 10,667 కేసులు నమోదయ్యాయని 380మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం 9,900 మరణాలతో ప్రపంచ జాబితాలో భారత్‌ 8వ స్థానానికి చేరింది. 

అన్నీ చూడండి

Sundeep Kishan: చందమామ మ్యాగజైన్ తరహా లో ఆకట్టుకున్న కరికాల నుంచి సందీప్ కిషన్ లుక్

మిస్సింగ్ మేఘన మూవీ కి మంచి పేరు రావాలి : వి. వి. వినాయక్

Keerthy Suresh: నిద్రలేని రాత్రులు గడుపుతున్న కీర్తి సురేష్..?

Varun Tej: ఓజీ టు పెద్ది సక్సెస్‌ ఓ రేంజ్ లో వున్నాయి, నా రేంజ్‌లో కనకరాజు వుంటుంది : వరుణ్ తేజ్

'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత

తర్వాతి కథనం
Show comments