తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (11:46 IST)
తిరుమల తిరుపతిలో మరోమారు చిరుతపులి కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం సర్కిల్‌లోని ఓ కొండపై గురువారం సాయంత్రం చిరుత కూర్చుని ఉండటాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. తమ సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకుని తితిదే విజిలెన్స్‌, ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో వాహనదారులను, భక్తులను అధికారులు అప్రమత్తం చేశారు. 
 
కాగా, గతంలో పలుమార్లు చిరుతపులి తిరుమల కొండల్లో కనిపించి కలకలం రేపిన విషయం తెల్సిందే. వైకాపా ప్రభుత్వంలో ఓ చిరుత పులి ఓ బాలికపై దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు రక్షణగా వైకాపా పాకలకులకు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో కూడిన చేతికర్రలను కూడా ఇచ్చింది. ఈ చర్య విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత కొంతకాలం చిరుతపులి హడావుడి కనిపించలేదు. ఇపుడు మళ్లీ కనిపించడంతో కలకలం చెలరేగింది. దీంతో కానినడకన తిరుమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా నడిచి వెళ్లరాదని, సమూహాలుగా వెళ్ళాలని సూచన చేసింది. 

అన్నీ చూడండి

Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల

Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన

Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments