Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం జిల్లాలో చిరుత సంచారం...

Written By సెల్వి
Updated: బుధవారం, 2 డిశెంబరు 2020 (13:12 IST)
అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కాలనీ శివారులో చిరుత సంచరించడంతో ఆ గ్రామస్తులంతా భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామం ఎస్సీ కాలనీలో చిరుత సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎస్సీ కాలనీ శివార్లలో వచ్చి కొండ పక్కనే పొదల్లో దాగి ఉందని గ్రామానికి చెందిన కొంతమంది యువకులు చెబుతున్నారు. 
 
చిరుత నుంచి తమకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. చిరుతను గ్రామంలోని పలువురు ప్రత్యక్షంగా చూడడంతో పాల వెంకటాపురం గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments