ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జవాను సాయి తేజ కుటుంబాన్ని పరామర్శించారు. కురబలకోట మండలం ఎగువరేగడకు చేరుకున్న మంత్రి పెద్దిరెడ్డి సాయి తేజ కుటుంబ సభ్యులను కలుసుకుని జవాను మృతికి సానుభూతిని తెలియజేశారు.