ఏకి ప్రధాని మోడీ సర్కారు షాక్.. పోలవరం నిధుల్లో కోత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో వాతపెట్టింది. పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునే

గురువారం, 22 మార్చి 2018 (15:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో వాతపెట్టింది. పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత అనుమతించింది. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే కేంద్రం మాట మార్చింది. 
 
పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టి కేవలం రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించింది. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
 
ప్రస్తుతం విభజన చట్టంలో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ, వైసీపీ, వామపక్షాలు  ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై వేర్వేరుగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేంద్రం పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కోత పెట్టడంతో పుండుమీద కారం చల్లినట్టయింది. 

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments