రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

ఆదివారం, 8 ఆగస్టు 2021 (09:14 IST)
చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఆర్పీఎఫ్‌ బ్యారక్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈయన రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బ్యారక్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు కలకలం రేపుతోంది. 
 
కాగా, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాగా పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments