విశాఖ నుంచి స్వదేశానికి బయలుదేరిన దక్షిణ కొరియావాసులు... అసలేంటి కథ

ఆదివారం, 28 జూన్ 2020 (12:10 IST)
విశాఖపట్నం ఎల్జీపాలిమర్స్ లో మే నెల 7 తారీఖున విషవాయువు లీక్ అవడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సంఘటన ఎలా జరిగిందో కారణాలు తెలుసుకునేందుకు ఎల్జి పాలిమర్స్ 8 మంది సభ్యులతో కూడిన బృందం మే నెల 13 వ తారీఖున సౌత్ కొరియా నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.

జరిగిన సంఘటనపైన విశాఖజిల్లా కోర్టులో కేసు అవడంతో ఆ బృందాన్ని విశాఖ నగరం విడిచి వెళ్లకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వారు అప్పటి నుంచి విశాఖపట్నంలోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు.

వారికి హైకోర్టు వారి సొంత దేశమైన సౌత్ కొరియా వెళ్ళటానికి ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొరియా వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సౌత్ కొరియా బయలుదేరారు.

అన్నీ చూడండి

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

దాసరి ఇండస్ట్రీలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారు : మంచు మనోజ్

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

తర్వాతి కథనం
Show comments