1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 179 corona cases in AP

ఏపీలో 179 కరోనా కేసులు

corona cases
ఏపీలో కరోనా కేసులు కొత్తగా 179 నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41,167 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 179 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో ఈ వైరస్‌ బారినపడి నలుగురు మరణించారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 219 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇప్పటి వరకు 1,24,82,943 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా 88,56,16 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,76,140 మంది పూర్తిగా కోలుకోగా, 7,138 మంది మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2,338 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 మంది ఈ కరోనా వ్యాధికి గురవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరికి కరోనా వచ్చింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
రాజధానిగా విశాఖ రెడీ?