1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 6 special trains canceled in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో 6 ప్రత్యేక రైళ్లు రద్దు

6 special trains
ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆరు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
 
విశాఖఫట్నం-కాచిగూడ రైలును జులై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు, విశాఖపట్నం-కడప రైలును జులై 1 నుంచి 14 వరకు, కడప-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు, విశాఖపట్నం-లింగంపల్లి రైలును జులై 1 నుంచి 14 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
 
మరో వైపు ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 
 
సికింద్రాబాద్‌- అగర్తల రైలు జులై 5, 12న, అగర్తల-సికింద్రాబాద్‌ రైలు జులై 9, 16న బయల్దేరతాయి. అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు జులై 6 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. 
 
బెంగళూరు కంటోన్మెంట్‌-అగర్తల రైలు జులై 9 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం బయల్దేరుతుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అందుబాటులోకి మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు..
 
గురువారం నుంచి హైదరాబాద్‌లో మరో 45 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 12 సర్వీసులు, లింగంపల్లి-హైదరాబాద్‌ 12 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి వయా రామచంద్రాపురం 16 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా వయా రామచంద్రాపురం 15 సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 
 
ఇప్పటికే 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయని వాటికి అదనంగా మరో 45 సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
వ్యభిచారుల కోవిడ్ క‌ష్టాలు, కుప్పల్లా పేరుకున్న అప్పులు