కోడెల కాన్వాయ్లో జీపు బోల్తా...ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కాన్వాయ్లోని ఒక వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న పోలీసులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఓ కార్యక్రమానికి స్పీకర్ శివప్రసాద్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదిగానిపల్లె వద్ద ఆయన వాహన శ్రేణిలోని ఓ జీపు అదుపు తప్పి బోల్తా పడింది.
ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.