1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (20:33 IST)

కృష్ణపట్నంలోని తన నివాసానికి వచ్చిన ఆనందయ్య

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని తన నివాసానికి ఆనందయ్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ నేతలు కలిశారు. ఆనందయ్య కోసం పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఆనందయ్యను పోలీసులు మరో చోటుకు తీసుకెళ్లే అవకాశం‌ ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఆనందయ్య ఇస్తున్న కరోనా మందును ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత ఆనందయ్య కూడా కనిపించుకుండా పోయారు. అయితే ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి కనుసన్నల్లోనే రహస్య ప్రాంతంలో ఆనందయ్య ఉన్నట్టు ప్రచారం జరిగింది.

ఆనందయ్య చుట్టూ పోలీస్‌ వలయం ఉంది. ఆనందయ్యను కనీసం బంధువులతో కూడా పోలీసులు మాట్లాడనివ్వడం లేదు. కృష్ణపట్నంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. బయట ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు. 
 
అయితే ఇంతకుముందు ఆనందయ్య వీడియో ద్వారా ఓ సందేశాన్ని పంపారు. టీవీల్లో, వాట్సాప్‌లలో కరోనాకు మందు శుక్రవారం ఇస్తున్నారని ప్రకటనలు చేస్తున్నారని అవన్ని అబద్దాలని, వాటిని నమ్మొద్దని తెలిపారు. మందు తయారు చేయడం నిలిపివేశామని, మందు తయారు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు.

పర్మిషన్ ఇచ్చిన వెంటనే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తాన్నారు. ప్రస్తుతం మందు తయారీకి తనవద్ద వనమూలికలు, ద్రవ్యాలు లేవన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే తాను టీవీ ప్రకటన చేసి.. మందు తయారు చేసి అందరికీ సరఫరా చేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు.