శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (09:10 IST)

24 నెలలు... 32 అత్యాచారాలు... ప్రేమజంటలే లక్ష్యంగా...

ఏలూరులో ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు చేస్తున్న రేప్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత 24 నెలల్లో 32 అత్యాచారాలు శారు. తమ దారికిరాని వారిని హత్య కూడా చేశారు. అలా మూడు హత్యలు చేశారు. 
 
ఇటీవల బౌద్దారామాల వద్ద ప్రేమ జంటపై దాడి, ఆపై యువతి హత్య కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు..... అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు నలుగురు హంతకులను అరెస్టు చేశారు. వీరిని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
ఈ సందర్భంగా హంతకుల నేపథ్యాన్ని పోలీసులు వివరించారు. హంతకులు వృత్తిగా అడవి పందులు, జంతువులను, పక్షులను వేటాడేవారు. ప్రవృత్తిగా ప్రేమ జంటలే టార్గెట్‌. 24 నెలల్లో నాలుగు హత్యలు, 32 అత్యాచారాలకు తెగబడ్డారు. ఇప్పటికే మూడు హత్యలు, మూడు అత్యాచారాలపై కేసులు నమోదైనా ఈ నేరస్తులను సంబంధిత పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. 
 
జిల్లాలోని బౌద్దారామాల వద్ద జరిగిన ప్రేమజంటపై దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హంతకులను అరెస్టు చేయగలిగారు. వీరు చెప్పిన నేరాలను విన్న పోలీసులే అవాక్కయ్యారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.