మంగళవారం, 22 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (19:01 IST)

125 రోజుల్లోనే రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేశాం.. బాబు

Chandra babu
పోలీసు శాఖకు చెందిన 763 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఇకపై తమ సర్కారు క్లియర్ చేస్తుందని, 6,100 మంది కానిస్టేబుళ్లను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 
 
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం (వైఎస్‌ఆర్‌సీపీ) పోలీసు శాఖకు చెందిన రూ.763 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. 
 
పోలీసు శాఖకు సహకరించేందుకు దశలవారీగా నిర్ణయాలు తీసుకుంటామని, ఆ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని పోలీసు సంస్మరణ దినోత్సవంలో భాగంగా బాబు తన ప్రసంగంలో తెలిపారు. పోలీసు శాఖలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం లాంటిదని పేర్కొన్న సీఎం.. దానికి తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ సహకరిస్తున్నానని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే శాఖకు చెందిన రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులను ఇప్పటికే క్లియర్ చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం వుందని.. పోలీసులు పాత ఫ్యాషన్ సాంకేతిక సాధనాలతో నేరస్థులతో పోరాడలేరని అన్నారు.