గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (16:00 IST)

మొన్న ఇసుక ప్యాకెట్లు.. ఇపుడు ఉల్లి దండలు.. ప్రతిదీ రాజకీయమే : మంత్రి కన్నబాబు

ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తూ రాజకీయాలు చేయటంపై మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మొన్న ఇసుక సమస్య అంటూ ఇసుక ప్యాకెట్లు, దండలు వేసుకొని రోడ్డు మీదకు 
వచ్చారు. నిన్న ఉల్లిపాయ దండలు వేసుకొని వచ్చారని కన్నబాబు అన్నారు. సభలోనూ సోమవారం చాలాసేపు గొడవ కూడా చేశారన్నారు. వినియోగదారుడు ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోలేదని వేరే కారణాలతో చనిపోయారని 
మృతుని కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి మీడియాలో చూశానని కురసాల కన్నబాబు చెప్పారు. 
 
సోమవారం అంతా సభను ఆపటానికి ఏదో సంఘటన జరిగితే దాన్ని దీనికి లింక్‌ చేసి మహిళల భద్రతపై చాలా కీలకమైన చర్చను ప్రక్కదారి పట్టించారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. వ్యవసాయ శాఖామంత్రిగా రెండు విషయాలు సభ దృష్టికి తీసుకువస్తున్నానని కన్నబాబు తెలిపారు. మొదటిది మార్కెట్‌ ఇంటర్వెన్ష్‌ సంబంధించింది అయితే, రెండోది వైయస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకమని ఆయన తెలిపారు. 
 
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేసి మిషన్‌ దాని ఛైర్మన్‌గా ప్రతినెలా సమావేశాన్ని 
నిర్వహిస్తున్నారని కన్నబాబు అన్నారు. ప్రతి వ్యవసాయ మిషన్‌ మీటింగ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ మీద ఫస్ట్‌ ఐటం అజెండాగా సీఎం గారే రివ్యూ చేస్తున్నారని తెలిపారు. వచ్చే మూడు నెలల తర్వాత ఏ సమస్యలు 
రాబోతున్నాయి. ఆ ఛాలెంజ్‌ ఎదుర్కోవటానికి మన దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటని సీఎం సమీక్షిస్తున్నారు. 
 
కేవలం ఉల్లిపాయలే కాదు.. ఉల్లితో పాటు కాటన్‌ ఇతర పంటలు సమీక్షిస్తున్నారని మంత్రి కన్నబాబు వివరించారు. నాలుగు నెలల క్రితమే ఉల్లిపై సమీక్షించారు. అప్పుడు ఉల్లి వేసే సమయానికి వర్షాభావం, పంట తీసే సమయానికి వర్షాలు వచ్చి మహారాష్ట్ర, ఏపీలో పంట ఉత్పత్తి తగ్గిపోయిందని ఉల్లి కొరతకు కారణాలను కన్నబాబు తెలిపారు. దీనివల్ల రైతుకు నష్టపోయే సమయంలో, వినియోగదారుడుపై భారం పడే సమయంలో ఇంటర్వెన్‌ అయి కాపాడాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. 
 
సీఎం వైయస్‌ జగన్‌ చెప్పినట్లే కిలో ఉల్లికి రూ.100 సబ్సిడీ ఇచ్చి రైతు బజార్లో అమ్మిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమైన ఒక్క ఉల్లిపాయల మీద రూ.100లు సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఉందా అని కన్నబాబు ప్రశ్నించారు. తెలంగాణలో 
రూ.40-45లకు ఒక్క రైతు బజారులోనే అమ్ముతున్నారని కన్నబాబు తెలిపారు. ఏపీలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉల్లిపాయలు అమ్ముతున్నారని వివరాలు తెలిపారు. పెద్దలు కొందరు ప్రతిపక్ష నాయకులు ఉల్లిపాయలు వాలంటీర్లతో ఇంటింటికీ ఎందుకు పంపించరని అడుగుతున్నారు. కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. కేజీ పంపించాలంటే దాదాపు 15 వేల టన్నులు కావాలి. 
 
అస్సలు అంత ప్రొడక్షన్‌ దేశంలోనే ఉందా అని కన్నబాబు ప్రశ్నించారు. ఇంచుమించు రోజుకు 3వేల టన్నులు అవసరం ఉంటుంది. అందుకనే మొన్న సమావేశంలో సీఎం కీలకమైన నిర్ణయం తీసుకున్నారని కన్నబాబు తెలిపారు. దీనికోసం విజిలెన్స్‌ ఐజీని కూడా పిలిపించారు. కర్నూలు, తాడేపల్లి మనకు కీలకమైన మార్కెట్లు. ఈ మార్కెట్ల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోకుండా బోర్డర్లు సీజ్‌ చేయమని సీఎం ఆదేశించారు. మన అవసరాలు తీరాక బయట విక్రయించుకోవాలని చెప్పారు. అవసరమైతే ఇక్కడే కొనుగోలు చేయాలని చెప్పారు. చరిత్రలో మొదటిసారిగా మార్కె్‌ట్‌ నుంచి మార్కెట్ రేటుకు కొనుగోలు చేసిన ప్రభుత్వం లేదన్నారు. ఎప్పుడైనా రైతుల నుంచి కొనుగోలు చేశారు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నది సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే అని కన్నబాబు తెలిపారు. 
 
తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి ఉల్లిపాయలు సబ్సిడీ మీద అందించటానికి కొనుగోలు చేస్తున్నామని కన్నబాబు తెలిపారు. టమోటా రేటు పడిపోతే స్పాట్‌లోనే కొనుగోలు చేయించి వేరే మార్కెట్‌లకు పంపించి దళారులను అరికట్టిన చరిత్ర సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఖ్యాతి దక్కుతుందని అన్నారు. రాజకీయాన్ని వ్యవసాయానికి, వినియోగదారులకు ముడిపెట్టడం భావ్యం కాదని కన్నబాబు హితవు పలికారు. 
 
మహిళా భద్రత, రక్షణ మీద మాట్లాడుతుంటే ఉల్లి గురించి మాట్లాడతారు. తీరాతేలింది ఏమిటి అంటే ఆ మరణం ఉల్లిపాయలకు సంబంధించినది కాదని. అసెంబ్లీ మొదటి రోజే అవకాశం దొరికిందని ఉల్లిపాయ దండలు వేసుకొని వచ్చారు. గతంలోనూ ఇసుక కొరత వచ్చిందని ఇసుక దండలు వేసుకొని కూర్చొన్నారని ప్రతిపక్ష రాజకీయాలను ఎద్దేవా చేశారు. దేశంలో సమయానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే అని వేరే రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువకు సబ్సిడీ ఇస్తున్నారేమో చెప్పండని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. 
 
సరైన సమయంలో సీఎం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తున్నారన్నారు. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారా? సబ్సిడీ మీద రూ.25లకు అమ్మమని. ఆ నిర్ణయాన్నిసీఎం గారే తీసుకున్నారు. ఒకరితో మనం చెప్పించుకునే పరిస్థితి తీసుకురావద్దని ప్రతి సమావేశంలో మాతో సీఎం చెప్తారు. సమస్యల కన్నా ముందుగానే మనం మేల్కొనాలి. ముందుగానే సమస్యను పసిగట్టండి.. పరిష్కరించటానికి ఏమి చేయాలో చెప్పండని సీఎం అంటారని కన్నబాబు తెలిపారు. 
 
రూ.3వేల కోట్లతో మార్కెట్‌ ఇంటర్వెన్ష్‌ ఫండ్‌ ఏర్పాటు చేశారు. ఆ ఫండ్‌ నుంచి ఇవాళ్టి వరకు శెనగ రైతులకు రూ.330 కోట్లు, ఎక్కడో పేపర్‌ మిల్లు జామాయిల్‌ కొనుగోలు చేసి ఎగ్గొడితే రూ.5 కోట్లు, తెలంగాణతో సమానంగా ధర కోసం ఆయిల్‌ఫాం రైతులకు రూ.85 కోట్లు ఇంటర్వెన్ష్‌ ఇస్తున్నారు. సోమవారం టీడీపీ వారు చేసిన ఆందోళన, పోడియం దగ్గర వారు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలని కన్నబాబు డిమాండ్‌ చేశారు. మృతుని కుటుంబీకులు కూడా మమ్మల్ని ఎందుకు రోడ్డు మీదకు లాగుతారని స్పష్టం చేశారు. దానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి కురసాల కన్నబాబు కోరారు.