1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP CM YS Jagan gives Permission for Compassionate Appointments

కారుణ్య ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య ఉద్యోగ నియామకాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
అయితే, ఈ కారుణ్య నియామకాల వర్తింపు, ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఈ యేడాది జూన్ 30వ తేదీలోపు ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీచేశారు. 
 
అయితే, ఈ కారుణ్య నియామకాల కింద మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన లేదా అంతకంటే తక్కువగా ఉన్న ఉద్యోగ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. నిజానికి ఈ కారుణ్య మరణాలు గత యేడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ,  దరఖాస్తులు అనేకం ఉండటంతో ఈ ఉద్యోగాల నియామకంలో జాప్యం జరిగింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం: ఒక్కరోజులోనే 6వేలకు పైగా కేసులు