1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (15:15 IST)

తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి మళ్లీ నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఇటీవల ఆయన పదవీ కాలం ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో టీటీడీ బాధ్యతలను మరోసారి ఆయనకే అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
 
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. అయితే, ఆయన పదవీ కాలం పూర్తయ్యాక వేరే వ్యక్తిని నియమించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సుబ్బారెడ్డికే ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే బోర్డు సభ్యులను కూడా నియమించనున్నారు.
 
మరోవైపు, సుబ్బారెడ్డికి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో వైవీకి బెర్త్ ఖాయం అయిందని టాక్ కూడా వినిపించింది. అయితే సీఎం జగన్ మాత్రం టీటీడీ బోర్డు బాధ్యతలే అప్పగించేందుకే మొగ్గు చూపారు.