కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు సాయిబాబా కాలనీలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, షేక్ యూసఫ్ తన భార్యతో గొడవపడి, ఇద్దరు పిల్లలను తీసుకుని గుంటూరులోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన పిల్లలను హుస్సేన్, ఆరిఫ్లకు ఎలుకల మందు పెట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.