శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:17 IST)

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

narayanap
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పట్టణాల్లోని కీలక ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేయడంపై నిషేధం విధించే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా చట్టాన్ని చేశాయని ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
 
పట్టణ ప్రధాన రహదారి సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని చేశాయని గుర్తు చేసిన మంత్రి.. త్వరలో మన రాష్ట్రంలో కూడా చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.