1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Bank timings in AP changed

ఏపీలో బ్యాంకు వేళల్లో మార్పులు...

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి బ్యాంకు పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో రేపటి నుంచి జనజీవన కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించనున్నారు. 
 
ఈ నెల 20 వరకు ఈ తాజా వేళలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళలను అందుకు అనుగుణంగా సవరించారు. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. 
 
అయితే, బ్యాంకుల సిబ్బంది తమ పరిపాలనా విధుల నిమిత్తం సాయత్రం 5 గంటల వరకు బ్యాంకుల్లోనే ఉండనున్నారు. ఈ మేరకు బ్యాంకుల పనివేళల్లో ఎస్ఎల్ బీసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించిన సంగతి తెలిసిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆధార్ లేకున్నా వ్యాక్సిన్ వేసుకోవచ్చు .. ఎక్కడ?