1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:49 IST)

శాంతిపురంలో పెళ్లి కూతురు జంప్... మరో అమ్మాయితో వరుడికి పెళ్లి

పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఏ మాత్రం ఇష్టంలేని ఓ అమ్మాయి పెళ్లికి ముందు రోజే జంప్ అయ్యింది. ముహూర్తం సమాయానికి పెళ్ళి చేసి తీరాలనుకున్న పెద్దలు అప్పటికప్పుడు మరో అమ్మాయితో పెళ్ళి చేసి తంతు ముగించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
64 పెద్దూరు పంచాయుతీ సోమాపురానికి చెందిన యువతికి కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా హనుమంతపురం అబ్బాయితో పెళ్లి నిశ్చయుమైంది. శుక్రవారం వరుడి స్వగృహం వద్ద పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ పెళ్ళి ఇష్టం లేని పెళ్ళి కూతురు గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి జంప్ అయ్యింది. ఆమె ఎక్కడికెళ్లింది? ఎలా వెళ్ళిందనే అంశం తెలియడం లేదు. అయితే అదే ఊరికి చెందిన మరో యువకుడు కూడా కనిపించడం లేదు. 
 
అయితే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో అప్పటికప్పుడు మరో అమ్మాయిని వెతికి వరుడికి నిశ్చయించిన ముహుర్తానికే పెళ్లి జరిపించారు. సోమాపురానికి చెందిన వధువు తండ్రి తన కుమార్తెకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తన కుమార్తెకు మాయమాటలు చెప్పి తీసుకుపోయడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.