1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (09:54 IST)

పీఆర్సీపై మంత్రుల కమిటీతో సీఎం జగన్ చర్చ

రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పీఆర్సీ ఆందోళనల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రుల కమిటీతో దీనిపై చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం ఏవిధంగా నెరవేర్చగలదన్న దానిపై చర్చించనున్నారు.

 
ఈ భేటీకి సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారు. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సమస్యపై చర్చించి దీనికి చరమగీతం పాడాలని కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.