1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (13:06 IST)

వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చిన పృథ్వీ

prithviraj
కమెడియన్ పృథ్వీ ప్రస్తుతం వైసీపీపై విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. వైసీసీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసి 2014 ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న పృథ్వీ.. ప్రస్తుతం అదే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పిన పృథ్వి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు.
 
పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీ తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నుంచి కూడా దూరమయ్యాడు.
 
అప్పట్లో పృథ్వికి సంబంధించిన ఓ ఆడియో కాల్ సెన్సేషన్ అయింది. అయితే ఈ విషయంలో తనపై కుట్ర జరిగిందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
 
తాజాగా ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చారు.. పృథ్వీ ప్రస్తుతం ఆ కామెంట్స్  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
 
తన రాజీకీయ జీవితంలోని చాలా విషయాలపై పృథ్వి ఓపెన్ అయ్యాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లుగా.. ఒకతను తన మైండ్‌ను పొల్యూట్ చేసి వైసీపీ వైపు నడిపించాడని పృథ్వి చెప్పడం గమనార్హం.
 
ఇకపోతే వైసీపీలోకి వెళ్లాక అహంకారం, కొవ్వు, మదం పట్టి నేనే టాప్ అన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడేశాను అని పృథ్వి అన్నాడు. అప్పుడు అక్కడుంది పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది అని చెబుతూనే ఆ పార్టీలో ఒక మూర్ఖుడిగా ఉండిపోయా అని అన్నారు.