ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (21:18 IST)

కృష్ణా - ఆటోనగర్‌లో కలకలం : టీ వ్యాపారికి కరోనా పాజిటివ్ ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ హల్చల్ సృష్టిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పైగా, ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బుధవారం కూడా 70కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ఇంతలోనే కృష్ణా జిల్లాలో ఓ కలకలం చెలరేగింది. జిల్లాలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఓ టీ వ్యాపారికి కరోనా వైరస్ సోకినట్టు వార్త స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ టీ వ్యాపారి స్థానికంగానే కాకుండా, కార్మిక్ నగర్, ఆటో నగర్‌లలో కూడా టీ విక్రయిస్తూ పోషణ సాగిస్తున్నాడు. దీంతో ఆ రెండు ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
టీ దుకారణ యజమానికి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా, ఈ టీ దుకాణంలో టీ సేవించిన వారిని గుర్తిస్తున్నారు. వీరందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, వైరస్ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి మిగిలిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.