గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (13:22 IST)

కిక్కుకోసం శానిటైజర్ తాగారు, మృత్యువులోకి జారుకున్నారు

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కురిచేడులో కిక్కుకోసం శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. వివరాలిలా వున్నాయి... కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర ఉండే నలుగురు యాచకులు, మరో నలుగురు గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో మద్యం ధరలు పెరిగాయి.
 
ఫలితంగా వారు గత కొద్దిరోజులుగా శానిటైజర్లు సేవిస్తున్నారట. గురువారం రాత్రి కడుపులో మంటతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఇటు కురిచేడులో రమణయ్య శానిటైజర్‌తో పాటు నాటు సారా కలిపి తాగడంతో మరణించాడు.
 
అదే జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. ఒకే యాచక బృందానికి చెందిన వీరంతా వేరువేరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మత్తుపై వీరికున్న మోజు మరణానికి దారితీసింది.