ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (16:54 IST)

డిసెంబ‌రు 1 నుండి టిటిడిలో వ‌స్త్రాల ఈ - వేలం

టిటిడిలో వినియోగంలో లేని వ‌స్త్రాలు 287 లాట్ల‌ను డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో ప‌ట్టువ‌స్త్రాలు, ఆర్ట్ ప‌ట్టు, పాలిస్టర్‌, సాధార‌ణ పంచ‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, శాలువ‌లు, రెడీమేడ్లు, దుప‌ట్టాలు, పంజాబీ డ్రెస్ మెటీరియ‌ల్, హుండీ గ‌ల్లేబులు త‌దిత‌ర వ‌స్త్రాలున్నాయి.
 
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.
 
డిసెంబ‌రు 4న‌ విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మ‌కానికి ఈ - వేలం
తిరుమ‌ల‌లోని కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారు చేసిన ఆరు వేల ట‌న్నుల ఎరువును డిసెంబ‌రు 4న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. 
 
ఇతర వివరాలకు తిరుమ‌ల‌లోని ఇఇ - 8 కార్యాలయాన్ని 0877-2263525, 0877-2263241 నంబ‌ర్ల‌లో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.