1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:29 IST)

కేసీఆర్‌కు సద్బుద్ధిని ప్రసాదించాలని మొక్కుకున్నా: ఎర్రబెల్లి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సద్బుద్ధిని ప్రసాదించాలని తాను సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుకుండా చూడాలని ... ఆయనకు కోపం, గర్వం కూడా తగ్గించాలని తాను వనదేవతలను వేడుకున్నానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారని ఆయన విమర్శించారు.
 
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు. టీడీపీ నాయకులకు మేడారం పూజారులు గిరిజన సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు