1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:45 IST)

తిరుపతిలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు శుభపరిణామం: ఎంపి గురుమూర్తి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి. తిరుపతిలోని ఎంపి కార్యాలయంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ ఎంపి గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ఎంపి గురుమూర్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని ఘనంగా సన్మానించారు.  

 
అనంతరం మీడియాతో తిరుపతి ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ కోసం కేటాయించిన తిరుపతిలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పడం శుభపరిణామమన్నారు. ఎంతోమంది క్రీడాకారులకు అకాడమీ ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తిరుపతి ఎంపి.

 
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 7లక్షల రూపాయల నగదుతో పాటు 5 ఎకరాల స్ధలాన్ని అకాడమీ కోసం ఇవ్వడంపై సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రపంచ శ్రేణి అకాడమీకి భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు.