హైదరాబాద్ ఏజీ కార్యాలయంలో అగ్నిప్రమాదం: ఫర్నీచర్, డాక్యుమెంట్స్ దగ్ధం!
హైదరాబాద్ లక్డీకపూల్లోని ఏజీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో అర్ధరాత్రి డీ బ్లాక్లో రేగిన మంటలు మంగళవారం ఉదయం దాదాపు మూడు గంటల వరకు కొనసాగించాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే అప్పటికే ఆ ఫ్లోర్ లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డీ బ్లాక్లోని కీలక డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. డాక్యుమెంట్లతో పాటు కంప్యూటర్లు కూడా కాలిబూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.