1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Five battery autos donated to Tirumala Srivaru

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళం

battery autos
తిరుమల శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళంగా అందింది. వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ మరియు ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 ల‌క్ష‌ల‌ విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. జి.ఏ. హరికృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి  ప్రత్యేకంగా రూపొందించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
బాకీ వసూలు కోసం రెండేళ్ల బాలుడు కిడ్నాప్