శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:26 IST)

19 నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి‌ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుంచి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్-19 కార‌ణంగా ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది.

సెప్టెంబ‌రు 18న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు. వాహన సేవల సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహన సేవలు జరుగుతాయి. 

బ్ర‌హ్మోత్స‌వాల్లో రోజువారీ వివరాలు ఇలా వున్నాయి‌.
18-09-2020: అంకురార్పణం (సాయంత్రం)
19-09-2020: ధ్వజారోహణం (సాయంత్రం)
19-09-2020: పెద్దశేషవాహనం (రాత్రి)
20-09-2020: చిన్నశేషవాహనం (ఉదయం), హంస వాహనం (రాత్రి)
21-09-2020: సింహ వాహనం(ఉదయం), ముత్యపుపందిరి వాహనం (రాత్రి)
22-09-2020: కల్పవృక్ష వాహనం(ఉదయం), సర్వభూపాల వాహన (రాత్రి)
23-09-2020: మోహినీ అవతారం (ఉదయం), గరుడ సేవ (రాత్రి)
24-09-2020: హనుమంత వాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గజవాహనం (రాత్రి)
25-09-2020: సూర్యప్రభ వాహనం(ఉదయం), చంద్రప్రభ వాహనం(రాత్రి)
26-09-2020: శ్రీవారి రథోత్సవం (ఉదయం), అశ్వవాహనం (రాత్రి)
27-09-2020: చక్రస్నానం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి)