Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో విద్యార్థులు కిడ్నాప్-ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు?

Written By సెల్వి
Updated: బుధవారం, 9 నవంబరు 2022 (17:24 IST)
Kidnap
తిరుపతిలో పదవ తరగతి విద్యార్థులు కిడ్నాప్‌కు గురికావడం సంచలనం సృష్టించింది. తిరుపతిలోని నెహ్రూనగర్‌లో బుధవారం తెల్లవారుజామున స్టడీ అవర్స్‌కు వెళ్లి ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు సహా ఐదుగురు పదో తరగతి విద్యార్థులు కనిపించకుండా పోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 
 
వివరాల్లోకి వెళితే.. మెహత, గుణశ్రీ, మౌనశ్రీ, మరో ఇద్దరు విద్యార్థులు బుధవారం ఉదయం స్టడీ అవర్స్ కోసం వెళ్లి వారి ఇళ్లకు తిరిగి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు, స్టడీ అవర్స్ సెంటర్‌లో వెతికినా విద్యార్థులు కనిపించలేదు. వారు పాఠశాలకు వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీలో తేలింది.
 
వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. తిరుపతిలోని ఐస్ మహల్ సమీపంలో అన్నమయ్య స్కూల్‌లో మిస్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

అన్నీ చూడండి

ది మేజ్ నుంచి నన్నే నన్నే.. అనే మెలోడీ సాంగ్ ను ఆవిష్కరించిన ఆనంద్ దేవరకొండ

Srinivasa Mangapuramm Review: ఆకట్టుకోని జై కృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం రివ్యూ

Ramayan trialer: తమ్ముడూ యశ్ నువ్వు అదరగొట్టావు అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్

కాంతార రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు.. ఆస్ట్రేలియాలో లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు

Vijay Deverakonda :తరుణ్ భాస్కర్ పై విజయ్ దేవరకొండ విమర్శ, ప్రశసలతో స్వీట్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments