1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (22:07 IST)

ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కున్న కాలేజీ అమ్మాయి మృతి

student
student
విశాఖపట్నంలో రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని గాయాలతో మృతి చెందింది. తిరుపతి సమీపంలో ఓ కాలేజీ అమ్మాయి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. బుధవారం ఆసుపత్రికి తరలించగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు, కానీ ఆమె గురువారం మరణించింది.  
 
వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ప్రాంతానికి చెందిన శశికళ అనే బాలిక దువ్వాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది. 
 
రోజూ రైలులో కాలేజీకి వెళ్లే శశికళ నిన్న గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగగానే కాలు అదుపు తప్పి రైలు, ప్లాట్‌ఫారమ్‌ మధ్య ఇరుక్కుపోయింది. వెంటనే రైలును నిలిపివేసి విద్యార్థిని రక్షించే ప్రయత్నం చేశారు. 
 
కొన్ని గంటలపాటు పోరాడినా విద్యార్థిని బయటకు తీయకపోవడంతో ప్లాట్‌ఫారమ్‌ పగులగొట్టి విద్యార్థినిని రక్షించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం జరుగుతోంది.