గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:36 IST)

బోటు కిందే కుప్పలుతెప్పలుగా మృతదేహాలు? బయటకు తీయడం సాధ్యమా..?

పాపికొండల్లో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ ఎఫ్‌ బలగాలు. ఇప్పటికీ 34 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మూడురోజుల క్రితం బోటు బోల్తా పడితే 60 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొదటి రోజు 8 మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం 73మంది బోటులో ప్రయాణిస్తున్నారు. 
 
రెండు అంతస్తులుగా బోటు ఉండడంతో జనం ఎక్కువమంది ఎక్కేశారు. అయితే గజఈతగాళ్ళు కూడా 5 మంది ఉన్నారు. కానీ జనం ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పాపికొండల నడుమ గోదారిలో బోటు మునిగిన సమయంలో బలంగా అలలను ఢీకొనడంతో బోటు 321 అడుగుల లోతులోకి వెళ్ళిపోయినట్లు భావిస్తున్నారు.
 
పాపికొండల ప్రాంతంలో గోదారి లోతుగా ఉండడం.. గల్లంతైనవారంతా బోటు కింద చిక్కుకున్న ప్రాణాలు విడిచారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తమ వారి కోసం బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి సురక్షితంగా తమ వారు బయటపడతారేమోనని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు బంధువులు. అయితే మూడురోజుల క్రితం మునిగిపోయిన బోటులోని జనం సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.