గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (17:56 IST)

నా భార్య చాలా మంచిది.. ఆమెకు రెండో పెళ్లి చేయండి.. సూసైడ్ లెటర్‌లో భర్త

ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి సూసైడ్ లెటర్‌లో తన భార్యకు రెండో పెళ్లి చేయాల్సిందిగా తండ్రిని కోరాడు. ఈ ఘటన హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన చిత్తలూరి శ్రావణ్ కుమార్ (29)జూబ్లిహిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ఏడాది క్రితం సూర్యపేటకు చెందిన హరితతో వివాహం జరిగింది.  
 
శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన శ్రావణ్ గదిలోకి వెళ్లి.. తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని.. మద్యంలో కలుపుకుని తాగేశాడు. కాసేపటికి ఆ బాధను తట్టుకోలేక.. తలుపులను కొట్టాడు. దొంగలని భయపడిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూసేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఆ లేఖలో 'తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన తండ్రికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని, నేను అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చే దాకా నాకు కర్మఖాండ చేయొద్దని, అలాగే తన భార్య చాలా మంచిదని.. ఆమెకు వేరే పెళ్లి చేయాలని కోరాడు.