1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జూన్ 2025 (18:03 IST)

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

vangalapudi anitha
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ హోం మంత్రి అనిత మాటలదాడి చేశారు. రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ అని ఆరోపించారు. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. 
 
ఆమె సోమవారం ఏపీ సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, పొదిలిలో వైకాపా నేతల అరాచకాలను అందరూ చూశారు. పది అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో వైకాపా నేతలకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్ షో నిర్వహించారన్నారు. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం చాలా దారుణమన్నారు. గాయపడిన వ్యక్తిని దయ, జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారని ఆరోపించారు. 
 
సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లివుంటే ఆ వృద్ధుడు బతికేవాడేమో అని అన్నారు. జగన్‌కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇద్దరు వ్యక్తుల చనిపోయినా జగన్ తన పర్యటనను కొనసాగించారని ఆమె గుర్తుచేశారు. బెట్టింగులు చేసి ఆత్మహత్య చేసుకున్న మృతుని కుటుంబాన్ని యేడాది తర్వాత పరామర్శించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. 
 
పైగా, చేసిన తప్పును జగన్ సమర్థించుకోవడం మరింత దారుణమన్నారు. అందుకే జగన్ ఒక రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు అని అన్నారు. సత్యసాయి జిల్లాకు వెళ్లినపుడు రచ్చచేశారు. పొదిలిలో మహిళలు, పోలీసులపై రాళ్లదాడి చేశారు అని అన్నారు.